అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు

అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
– కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
పల్లవి, వెబ్ డెస్క్: రాబోయే రెండేండ్లలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా దేశంలో మౌలిక సదుపాయాలు ఉండేలా కేంద్ర సర్కారు కృషిచేస్తున్నదని, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో బోర్డర్లకు దగ్గరగా కఠినమైన భూభాగం ఉండడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు, ప్రధానంగా ఈశాన్య భారత్లో రోడ్ల విస్తరణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులను తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు అంశాలపై మాట్లాడారు.
మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్, ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో 784 హైవే ప్రాజెక్టులు
ఈశాన్య రాష్ట్రాల్లో 21,355 కిలో మీటర్ల పొడవున రూ. 3,73,484 కోట్ల అంచనా వ్యయంతో 784 హైవే ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు గడ్కరీ తెలిపారు. ‘‘ప్రస్తుతం అస్సాంలో రూ. 57,696 కోట్ల విలువైన ప్రాజెక్టులు, బిహార్లో రూ. 90 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్లో రూ. 42 వేల కోట్లు, జార్ఖండ్లో రూ. 53 వేల కోట్లు, ఒడిశాలో రూ. 58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడుతున్నాం” అని వివరించారు.
ఈశాన్యంలో ఈ ఏడాది దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. నాగ్పూర్లో రూ. 170 కోట్లతో సామూహిక వేగవంతమైన రవాణా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు.
నేషనల్హైవేల నెట్వర్క్ పొడవు 2014 మార్చిలో 91,287 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం 1,46,204 కిలోమీటర్లకు పెరిగిందని వివరించారు. రెండు లేన్ల కంటే తక్కువ ఉన్న జాతీయ రహదారుల నిష్పత్తి బాగా తగ్గిందని, మొత్తం నెట్వర్క్లో 30 శాతం నుంచి కేవలం 9 శాతానికి పరిమితమైందని చెప్పారు. 2024-25లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) లక్ష్యానికి మించి 5,614 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించిందని వెల్లడించారు.
Related News
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో పంచాయితీ రాజ్ రహదారుల్లో రూ.374 కోట్ల నష్టం- మంత్రి సీతక్క
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం
-
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్