సిద్దిపేటలో టీటీడీ వేంకన్న ఆలయం ఏర్పాటు
సిద్దిపేటలో టీటీడీ వేంకన్న ఆలయం ఏర్పాటు చేయాలని ఛైర్మన్ బీఆర్ నాయుడిని కోరారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తిరుపతి వెళ్లి మరి బీఆర్ నాయుడిని కలిశారు హరీశ్. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోదించాలని ఛైర్మన్ను కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో కొలువు దీరనుంది. సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని, ఆలయ నిర్మాణం కొరకు గతంలోనే సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో 5 ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని తెలిపాను. గతంలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరం అయిన స్థలాన్ని పరిశీలించారు.. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజైన్స్ ను రూపొందించారని చైర్మన్ కి వివరించాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట దైవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారు. అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టం. వచ్చే బోర్డు మీటింగ్ లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం కు ఆమోదం తెలిపి, మీరే ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిధిగా రావాల్సిందిగా కోరాను. అందుకు చైర్మన్ బి ఆర్ నాయుడు గారు సానుకూలంగా స్పందించి వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అని హరీష్ తెలిపారు.



