ఫ్రిడ్జ్ లో పెట్టకూడని వస్తువులు ఇవే..?
Refrigerator

పల్లవి, వెబ్ డెస్క్ : ఈరోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం సర్వసాధారణమైంది. అయితే చాలా మంది వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్ లో పెట్టడటం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో చాలా మంది మిగిలిపోయిన లేదా వాడాల్సిన పాలను రిఫ్రిజిరేటర్ తలుపు ఉన్న ప్రాంతంలో పెడుతారు. ఇలా పెట్టడం వల్ల పాలలోని ఉష్ణోగ్రత దెబ్బతిని అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
అందుకే పాలను ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్ లోపలి భాగంలో ఉంచాలి. పాల తర్వాత గుడ్లను ఎక్కువమంది ఫ్రిడ్జ్ డోర్ లో పెడుతుంటారు.ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఉష్ణోగ్రత తరచూ మారడం వల్ల ఎగ్స్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇలా బ్యాక్టీరియా పెరగకుండా ఎగ్స్ ను కార్టన్ లో ఉంచి లోపలి భాగంలో పెట్టాలి. పచ్చి మాంసం , చికెన్ వంటి అహారాలు ఫ్రిడ్జ్ డోరు వద్ద ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే రసాలు కానీ ఇతర ఆహారాలను పాడు చేస్తాయి .
కాబట్టి ఫ్రిడ్జ్ కింద భాగంలో ఉన్న షెల్ప్ లో పెట్టాలి.పండ్లు, కూరగాయలను కూడా ఫ్రిడ్జ్ డోర్ వద్ద ఉంచడం వల్ల అవి త్వరగా పాడవుతాయి కాబట్టి వీటి కోస ఫ్రిడ్జ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలంలోనే ఉంచాలి.పనీర్, జున్నును కూడా డోర్ వద్ద పెట్టకుండా లోపలి భాగంలో ఉంచాలి.తలుపు డోరు వద్ద త్వరగా చెడిపోని సాస్, జ్యూస్, నీరు తదితరాలను మాత్రమే ఉంచాలి. ఇవి త్వరగా చెడిపోవు .