మాట ఇచ్చారు. నెరవేర్చారు

పల్లవి, వెబ్ డెస్క్ : మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి గ్రామాలలో మార్నింగ్ వాక్ కార్యక్రమం శ్రీకారం చుట్టారు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో గ్రామీణ సమస్యలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పైన విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేవారు…నెలన్నర క్రితం మునుగోడు మండలం పలివెల గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి బెంచీలు సరిగా లేవని విద్యార్థులు రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు…
త్వరలోనే కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తానని ఆ నిమిషమే హామీ ఇచ్చారు..విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం తన సొంత ఖర్చు ( 7 లక్షల రూపాయల వ్యయం ) తో పలివెల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు సరిపడా 110 బెంచీలను ప్రత్యేకంగా తయారు చేయించి పాఠశాలలకు ఇచ్చారు..కార్పొరేట్ పాఠశాలలో ఏ విధమైన డెస్క్ బెంచీలు ఉంటాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యతలో రాజీ పడకుండా ప్రతి తరగతి గదికి డెస్క్ బెంచీలు అందచేశారు..
గతంలో తమ పాఠ్యపుస్తకాలను ఎక్కడపడితే అక్కడ వేయాల్సి వచ్చేదని డెస్క్ బెంచీలు ఎమ్మెల్యే సార్ గారు ఇచ్చిన తర్వాత కూర్చున్న ప్లేస్ లోనే పాఠ్యపుస్తకాలను కూడా దాచుకునేలా బెంచిలు ఉన్నాయని విద్యార్థిని విద్యార్థులు మురిసిపోతున్నారు.. విద్యార్థిని విద్యార్థులు కొత్తగా ఏర్పాటు చేసిన డెస్క్ బెంచ్ లపై క్రమశిక్షణతో కూర్చొని శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటూ సంతోషపడుతున్నారు…రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు..
Related News
-
కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి – ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్
-
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి -మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
ఖమ్మంలో అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్
-
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు
-
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
నా కొడుకే వైఎస్సార్ వారసుడు – వైఎస్ షర్మిల