జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష
Minister Ponguleti Srinivas Reddy

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసే నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ స్పెషల్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్వో జి. మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్ల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్ధికశాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.