ఇందిరమ్మ ఇండ్ల పథకంతో కాంగ్రెస్ కు కష్టాలు – ఎడిటోరియల్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) తీసుకొచ్చిన రైతు బంధు పథక ప్రయోగం ఆ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి మరి ఏకంగా మొత్తం 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది. అయితే రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో.హుజురబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయిందనే చెప్పాలి.
ఏకంగా తమ సొంత పార్టీ నేతలే పలు సందర్భాల్లో ఒప్పుకున్న కఠోర వాస్తవమిది.ఎంతో అట్టహసంగా ప్రారంభించిన దళిత బంధు పథకానికి లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప ముంచింది.పార్టీ కార్యకర్తలే లబ్ధిదారులుగా ఎంపిక చేయడం కూడా అసలుకే ఎసరు తెచ్చింది.మొత్తానికి ప్రయోగాత్మకంగా తెచ్చిన దళిత బంధు పథకం కారు యాక్సిడెంట్ అయ్యేలా చేశాయి.ఇక సరిగ్గా ఇలాంటి పథకమే హస్తం పార్టీ నాశనానికి బాటలు వేసింది అని రాజకీయ విశ్లేషకులే కాదు ఆ పార్టీ నేతలే పలుమార్లు వ్యాఖ్యానించారు..
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద,మద్య తరగతి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నది ఈ పథకం యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం అని సీఎం తో సహా మంత్రులు , ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పలు సమావేశాల్లో పేర్కొంటున్నారు.కానీ ఈ పథకం పక్కదారి పడుతుందన్న విమర్శలు బహిరంగంగానే వినబడుతున్నాయి.ఇక్కడా..అక్కడా అని తేడా లేదు చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవతతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో లబ్ధిదారుల నుంచి అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు చేతివాటం చూపడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తుందనే విమర్శలు వస్తోన్నాయి.గ్రామాల్లో పలుకుబడి ఉన్న అధికార పార్టీ లీడర్లే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్ అని గుసగుసలాడుతున్నారు.పార్టీ కోసం పనిచేసిన వారు,తమ చెప్పు చేతల్లో ఉండే వారు,చేయి తడిపిన వారే లబ్ధిదారులుగా ఎంపిక అవుతున్నారన్న చర్చ జోరందుకుంది కూడా.
ఇక ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం పెడుతున్న నియమనిబంధనలు సైతం లబ్ధిదారులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది అని కూడా టాక్.మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్యూర్ పథకంగా మారుతోంది.అంతిమంగా బీఆర్ఎస్ పార్టీని దళిత బంధు డ్యామేజ్ చేసినట్టుగా….హస్తం పార్టీకి ఇందిరమ్మ ఇండ్ల పథకం కొంప ముంచేట్టు ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు