ప్రియుడి కోసం భర్తను….!

పల్లవి, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్(35)కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. రసూల్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య అమ్మూబీ ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేస్తూ జీవన సాగించేవారు.
ఈ క్రమంలో అమ్మూబీ ఇంట్లో ఉంటూ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పరిచయం అయిన కొన్ని రోజులకు అమ్ముబీ కి లోకేశ్వరన్తో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న తడవు తమకు అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా సరే తొలగించుకోవాలని అనుకున్నారు.
అంతే కొన్ని రోజుల క్రితం మొదట దానిమ్మ రసంలో విషం కలిపి ఇచ్చింది రసూల్ అది తాగకపోయే సరికి, తర్వాత సాంబారులో విషం కలిపి వడ్డించింది.. దీంతో రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోయ్యాడు. దీంతో కుటుంబీకులు హుటాహుటిన సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
రసూల్ రక్త నమూనాలు పరిశీలించిన డాక్టర్లు పురుగుమందు తీసుకున్నారు తెలిపారు.. దీంతో అనుమానం వచ్చి భార్యను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పింది అనుమానంతో ఆమె ఫోన్లోని వాట్సప్ చాటింగ్ను చూడగా అమ్మూబీ, లోకేశ్వరన్తో వేసుకున్న పథకం తెలిసింది.. ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది రసూల్ చనిపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్లను అరెస్టు చేశారు.