సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అంజి రెడ్డి , జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ గారు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవం లో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకపాత్ర అని అన్నారు.