పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సండ్ర
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా, టేకులపల్లి గ్రామంలోని వెంకటేశ్వర గోశాలలో రాబోయే వినాయక చవితి వేడుకల దృష్ట్యా, గోశాల నిర్వాహకులు శ్రీనివాస్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలో గోమయంతో తయారుచేసిన పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సండ్ర వెంకట వీరయ్య పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల విలువల కోసం ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని, గోశాల నిర్వహణలో తనదైన ప్రత్యేకతతో ముందుండే శ్రీనివాస్ ఆచార్యులు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



