గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో టీటీసీ భవన్ కార్యాలయంలో నిన్న శనివారం సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆదిలాబాద్, మెదక్ , కరీంనగర్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి , అడిషనల్ కలెక్టర్ . గరిమ అగర్వాల్ , రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి , వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవం లో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకపాత్ర అని తెలియచేయడం జరిగింది.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర