తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పల్లవి, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హజరైన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ అధికార అనాధికార ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యమకారులను హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ , మరియు ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సత్కరించారు.




