ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ..?
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు అయిన కల్వకుంట్ల కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారా..?. ఆ పార్టీకి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు ఖరారు అయిందా..?. వచ్చే దీపావళి పండుగనాడు ఈ పార్టీని లాంచ్ చేయనున్నరా..?. ఇప్పటికే బంజారాహీల్స్ లోని తన నివాసం పక్కన ఓ భవనాన్ని తీసుకున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీసీ నినాదమే కాన్సెప్ట్ తో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బహుజన రాష్ట్రసమితి పేరుతో ఓ పార్టీని పెట్టనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకెళ్లిన కవిత ఈ పేరు మీదనే పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించారని పొలిటీకల్ ఎక్సపర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ అని జనాల్లో ఇప్పటికే ప్రాచుర్యం ఉండటమే కాకుండా తెలంగాణ సమాజానికి దగ్గరైంది కాబట్టీ అని కవిత & టీమ్ భావిస్తున్నారంట. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ..?



