కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాటర్ బాటిల్ తో దాడి
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం ఆసిఫాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.
ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ ఇన్చార్జి శ్యా్మ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. శ్యామ్ నాయక్ను వాటర్ బాటిల్తో కొట్టింది.
ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్కు దెబ్బ తగిలింది.ఇక్కడే కాదు.. ఇటీవల ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది. ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.



