pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Telangana »
  • Non Loan Waiver Farmers Are In Confusion

నో క్లారిటీ.. రుణమాఫీ కాని రైతులు ఎటుపోవాలె?

నో క్లారిటీ.. రుణమాఫీ కాని రైతులు ఎటుపోవాలె?
  • Edited By: Pallavi,
  • Published on August 23, 2024 / 08:50 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, హైదరాబాద్​: రుణమాఫీ కాని రైతులు గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ రాకపోవడం, అధికారులు సరిగా స్పందించకపోవడంతో అన్నదాతలు రుణమాఫీ కోసం అటు బ్యాంకులు, ఇటు మండల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణమాఫీ కాని రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రభుత్వం చెప్తున్నా.. రైతుల సమస్యలను అడ్రస్​ చేయడంలో ముందడుగు పడటం లేదు. క్లస్టర్ల వారీగా గత సర్కారు హయాంలో నిర్మించిన రైతు వేదికలు ఉన్నా.. వాటి వద్ద సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం నడవడం లేదు. అధికారులు మండల కేంద్రాలకే పరిమితం అవుతుండగా.. రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.

నోడల్​ అధికారి..

రూ.రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూలును ప్రభుత్వం ప్రకటిస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇటీవల తెలిపారు. అర్హత ఉండి, ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమిస్తున్నామని, రైతులు తమ ఆధార్‌ కార్డులోని సమాచారం, బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు, పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం తదితర ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్‌ అధికారికి సమర్పించాలని ఆయన సూచించారు. ఈ నెల 20 నుంచే మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదుల స్వీకరణ మొదలైందని అధికారులు చెబుతున్నా.. మెజార్టీ జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.

వ్యవసాయ అధికారులు..

ఆయా మండలాల ఏవోలు వారి వారి కార్యాలయాల్లో అన్నదాతలకు అందుబాటులో ఉండాలని, మండలంలో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, పీఏసీఎస్‌లకు మండల వ్యవసాయ అధికారే బాధ్యత వహించాలని సర్కారు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రాల్లో చేపట్టే ప్రజావాణి తరహాలో కార్యక్రమం నిర్వహించాలని, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు ఇటీవల నిర్ణయించారు. రుణమాఫీ వర్తించని రైతులంతా మండల కేంద్రంలోని రైతు వేదికలు లేదా ఏఓలకు అర్జీలు సమర్పించవచ్చు. కానీ ఈ వివరాలేవీ రైతులకు తెలియడం లేదు. పది రోజుల పాటు కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి రుణమాఫీ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • confusion
  • farmers
  • HYDERABAD
  • MEDAK
  • Non-loan waiver

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

Latest
  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy