యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట : సీఎం రేవంత్ నిర్ణయం
యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్వరలో తిరుమలోని టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. శుక్రవారం రోజున యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం.. ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు విధివిధనాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. టీటీడీ స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
Related News
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
బీఆర్ఎస్ పని అయిపోయింది – సీఎం రేవంత్ రెడ్డి
-
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
లక్ష కోట్ల ఆస్తి సీక్రెట్ చెప్పవా కేసీఆర్ – సీఎం రేవంత్ రెడ్డి
-
కాళేశ్వరంపై సీబీఐ విచారణ – సీఎం రేవంత్ రెడ్డి