ఐపీఎల్ పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : ఐపీఎల్ లో 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్తోనే టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే. అతని సారథ్యంలో ఆ జట్టు అయిదుసార్లు టైటిల్ కూడా నెగ్గింది కూడా. అయితే గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరిగా రాణించడం లేదు.
దీంతో ఎంఎస్ ధోనీ నాయకత్వ సామర్థ్యంపై క్రీడా వర్గాల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటీవల ముగిసిన చివరి ఐపీఎల్ సీజన్లో సీనియర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఆ జట్టు కెప్టెన్గా బాధ్యలు చేపట్టాడు. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ముగిసిందా అన్న అనుమానాలకు తాజాగా ఆయనే తెరదింపాడు.
మళ్లీ ఎల్లో రంగు జెర్సీలోనే ఐపీఎల్ ఆడుతారా అని అడిగిన ప్రశ్నకు ఎంస్ ధోనీ సమాధానం ఇచ్చారు. తన నిర్ణయం తాను తీసుకునేందుకు చాలా సమయం ఉందని, ఎప్పుడూ ఎల్లో జెర్సీలోనే ఆడుతానన్నాడు. క్రికెట్ ఆడినా, ఆడకపోయినా.. తన జర్నీ ఎల్లో జెర్సీలోనే కొనసాగుతుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.