మాంసం ప్రియులకు షాక్.. ఇక నుంచి అమ్మాకాలు చట్టవిరుద్ధం
గతంలో నాన్ వెజ్ తినాలంటే.. ఎవరైన చుట్టాలు ఇంటికైన రావాలి..లేదంటే ఏదైన ఫెస్టివల్ అయిన అయ్యుండాలి.. అప్పుడే ఇంట్లో నాన్ వెజ్ వండుతారు. కానీ.. కాలం మారింది. అప్పుడు.. ఇప్పుడు అనే తేడా ఏం లేదు.. తినాలనిప్తే చాలు.. వెంటనే దొరుకుతుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. వెంటనే డెలివరి బాయ్ ఇంటిముందు వాలిపోతాడు. ఇక, మనదేశంలో మాంసం ప్రియులే ఎక్కువ.
మాంసం ముక్క లేనిదే ఏ కార్యం జరగదు. ఆలాంటిది.. మాంసాహారాన్ని నిషేదిస్తే తట్టుకోలగలుగుతారా?. అయితే.. ఈ వార్తా మాంసాహార ప్రియులకు పెద్ద షాకే. ఎందుకంటే.. మాంసం అమ్మాకలను నిషేధించారు. మాంసం అమ్మకం, వినియోగం చట్టవిరుద్ధమని..అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు.
అయితే.. ఇది దేశమంతట కాదు.. గుజరాత్రాష్ట్రంలోని భావ్నగర్(డి)లోని జైనుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన పాలిటనా సిటీలో మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేశారు అధికారులు. దీంతో ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన మొదటి నగరంగా పాలిటనా నిలిచింది.
నగరంలో దాదాపు 250 మాంసం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరసనలకు దిగారు. మాంసాహారం.. మనుషుల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుందని.. ప్రజలను, ముఖ్యంగా పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వాదించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమని నిబంధనలు తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారం తయారీ, ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్లోనూ ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.



