మాజీ గవర్నర్ కన్నుమూత…!
పల్లవి, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్ కు గవర్నర్ గా పని చేసిన మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు 79 సంవత్సరాల సత్యపాల్ మాలిక్ ఈరోజు మంగళవారం నాడు కన్నుమూశారు. సుదీర్ఘ అస్వస్థతతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మధ్యాహ్నం 1.12 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్లోని బాఘ్పట్కు చెందిన ప్రముఖ జాట్ నేత అయిన సత్యపాల్ మాలిక్ విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1974లో చౌదరి చరణ్ సింగ్ ‘భారతీయ క్రాంతి దళ్’ నుంచి పోటీచేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జనతాదళ్ నుంచి రాజ్యసభకు, ఆ తర్వాత లోక్సభ ఎంపీగా అలీగఢ్కు ప్రాతినిధ్యం వహించారు.
బీహార్ గవర్నర్గా 2017లో సత్యపాల్ మాలిక్ నియమితులయ్యారు. స్వల్పకాలం ఒడిశా గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఏడాది తర్వాత 2018లో జమ్మూకశ్మీర్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన హయాంలోనే 370 అధికరణను కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకశ్మీర్ గవర్నర్గా పూర్తికాలం పనిచేసిన అనంతరం ఆయన గోవా, ఆ తర్వాత మేఘాలయ గవర్నర్గా కూడా ఆయన సేవలందించారు.



