ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు..
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ మాటల మాంత్రికుడు, ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరో , పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన వార్ -2 ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ” స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ లు హిమాలయ పర్వతాల్లాంటి వారు. అలాంటి వారి సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కర్నీ ఆలరిస్తుంది. దేవర మూవీ విడుదలైనప్పుడే ఆ ఏడాది దేవర నామ సంవత్సరం అని నాడే చెప్పాను. ఇప్పుడు ఈ ఏడాది హృతిక్ రామారావు నామ సంవత్సరంగా పేర్కొంటున్నాను అని ” ఆయన అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” మెరుపు తీగల్లా ఉన్న ఇద్దర్నీ ఒకే తెరపై చూడటానికి మన రెండు కళ్లూ చాలవన్నారు. ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదనీ అంతకుమించి ఈ సినిమా ఉంటుందని దర్శకు అయాన్ ముఖర్జీ చెబుతున్నారన్నారు. సాధారణ యాక్షన్ మూవీ అయితే ఎన్టీఆర్ అవసరం లేదని ఏ భావోద్వేగాన్నైనా పలికించగల నటుడు ఎన్టీఆర్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
బంగారం ఉంటే నగ చేయించుకుంటారు కానీ ఆ నగను బీరువాలో దాచిపెట్టుకోరని , అలాగే ఎన్టీఆర్ కూడా బంగారం లాంటి వారేనని ఏ నగ చేయాలో అయాన్ కు తెలుసునని , అందుకే ఎన్టీఆర్ కోసం ఇక్కడదాక వచ్చారని ” ఆయన అన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందిన



