ట్రైలర్ శాంపిల్ మాత్రమే సినిమా ముందు ఉంది..!

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో , రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన మూవీ “కింగ్డమ్”. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జూలై ముప్పై ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి తన పక్కనుండి నన్ను నడిపిస్తే చాలా పెద్దోడ్ని అయిపోతాను అని’ ఆయన అన్నారు.
ఇంకా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ నేను ఎప్పటిలాగే ఈ చిత్రం కోసం కూడా ప్రాణాలు పెట్టి పని చేశాను. ఆ వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను ‘ అని ఉద్ఘాటించారు. హీరోయిన్ భాగ్రశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. హీరో విజయ్ పడిన కష్టాన్ని త్వరలోనే స్క్రీన్ పై చూడబోతున్నారు. ప్రేక్షకుల మదిలోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
కాగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ’ ఈ సినిమా మా రెండున్నరేండ్ల కష్టం. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ ఫైర్ సినిమాను మేము చూపించబోతున్నాం. ట్రైలర్ లో చూసింది కేవలం శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు మాత్రం గత నాలుగైదు ఏండ్లల్లో ఏం మిస్ అయ్యారో అది ఈ సినిమాలో ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ గారి కళ్లల్లో ఏ ఇంటెన్సిటీవ్ చేశారో అది ఈ సినిమాలో ఉంటుందని’ తేల్చి చెప్పారు.