మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్..బాలయ్య కూడా
మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డుని అందుకున్నారు
మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డుని అందుకున్నారు. 156 సినిమాలు..537 పాటలు,24 వేల స్టెప్పులతో అలరించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఇటీవల స్థానం దక్కించుకున్న చిరంజీవి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డుని అందుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి వేదికగా ప్రస్తుతం సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024)అవార్డుల వేడుక జరుగుతోంది. ఈ ఈవెంట్లో రెండో రోజు శనివారం ఏఆర్ రెహమన్, రానా, సమంత, బాలకృష్ణ, వెంకటేశ్ సహా పలువురు స్టార్స్ హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. “ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” పురస్కారం అందుకున్నారు చిరంజీవి. బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సినీ రంగ ప్రముఖులు,అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక,టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నాడు.ఉత్తమ విలన్ తెలుగు విభాగంలో దసర సినిమాకి గారు షైన్ టామ్ అవార్డును అందుకున్నారు. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత అందుకున్నారు.
#MegastarChiranjeevi garu received the "Outstanding Achievement in Indian Cinema" Award at the IIFA event in Abu Dhabi.#Megastar #Chiranjeevi ✨ @KChiruTweets #IIFAUtsavam2024 pic.twitter.com/bdT9d5wwTY
— Ravi Teja (@RaviTejaChiru) September 28, 2024



