‘డ్రాగన్’ వేట.. వచ్చేది జనవరిలోనే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి రోజుల్లో ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ కానున్నదని బీటౌన్ సమాచారం. ఈ నెలాఖరు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి రోజుల్లో ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ కానున్నదని బీటౌన్ సమాచారం. ఈ నెలాఖరు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరోలు బీజూ మీనన్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా కథ గురించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథనట. థాయిలాండ్, మయన్మార్, లాయిస్లను కలిపి భౌగోళికంగా గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడి నుంచే కొకైన్, గంజాయి స్మగ్లింగ్ అవుతూవుంటాయి. మాదకద్రవ్యాల సామ్రాజ్యానికి అదో స్వర్గధామం. అక్కడ జరిగే అరాచకాలు, అక్రమాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ‘డ్రాగన్’ అనే పేరు దాదాపు ఖరారైందని సమాచారం. ఆగస్ట్లోగా షూటింగ్ కంప్లీట్ చేసి, నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్కి కేటాయించనున్నారట ప్రశాంత్నీల్. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదల కానుంది.



