ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

పల్లవి, వెబ్ డెస్క్ : నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, కమల్ హసన్, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లను పెట్టి తీసిన కల్కి 2898 AD’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు .గతేడాది జూన్, 2024లో పాన్ ఇండియా మూవీగా విడుదలై ఈ సై-ఫై మిథాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పింది. ఈ సినిమా తర్వాత సీక్వెల్ ఉంటది అని శుభం కార్డులో కూడా చెప్పారు. అయితే, తాజాగా ఈ చిత్రం సీక్వెల్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
ఓ పాడ్ కాస్ట్ లో పాల్గోన్న దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ఈ ఏడాది చివరలో ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. కానీ ఈసీక్వెల్ చిత్రీకరణ మొదలవ్వాలంటే ఈ సినిమాలోని నటులందరి టైమ్స్ కుదరాలి. అలాగే ఇప్పటికే ప్రీ-విజువలైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా పెద్దవి కాబట్టి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేను అని బాంబు పేల్చారు.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరూ అందరూ బిజీగా ఉన్నారు అని అన్నాడు.అలాగే షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ మరింత సమయం పడుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. మరో 2 లేదా 3 సంవత్సరాల్లో సినిమా పూర్తవుతుందని అనుకుంటున్నానని మరో భారీ బాంబ్ పేల్చాడు.