జగన్ ది పరామర్శ యాత్ర కాదు దండయాత్ర- మంత్రి సత్యకుమార్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘ పరామర్శ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దండయాత్రలు చేస్తున్నారని’ విమర్శించారు.
పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఆరోపిస్తారు. ఎక్కువమంది పోలీసులను పెడితే రెండు వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ వాళ్ళే విమర్శలు చేస్తారని ఆయన ఫైర్ అయ్యారు. ఐదోందల మందితో వెళ్లి రైతులను పరామర్శించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. కానీ, ఆయన చేసింది ఏమిటి.?. అంటూ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. గత ఐదేండ్లలో ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా..?. రెండోందల యాబై కోట్ల రూపాయలను మామిడి రైతుల కోసం కేటాయించిన ఏకైక ప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు.



