బాబు పై జగన్ సెటైర్లు
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. ఈరోజు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ” నిన్న బుధవారం సత్తెనపల్లి పర్యటనలో పుష్ప -2 మూవీలోని ” గంగమ్మ జాతరలో పొట్టేల్ తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ” అనే డైలాగ్ తో పోస్టర్ ప్రదర్శించిన యువకుడ్ని అరెస్ట్ చేయడం హాస్యస్పదం.
పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా..?. పుష్ప పోస్టులు పెట్టిన తప్పేనా..?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?. రాచరిక వ్యవస్థలో ఉన్నామా ?” అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పోస్టర్ ను పట్టుకున్న యువకుడు ఒకప్పుడు టీడీపీ కార్యకర్తనే. ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉంది. నాడు బాబును నమ్మి ఓట్లు వేయించి ఉంటాడు.
తీరా అధికారంలోకి వచ్చాక బాబు గారి బుద్ధి చూపించడంతో టీడీపీపై కోపంతో మా పార్టీకి మద్ధతు పలికి ఉంటాడు. రైతులకు పంటపెట్టుబడి సాయం రావడం లేదు. మహిళలకు నెల నెల రావాల్సిన పైసలు రావడం లేదు. ఆరోగ్య శ్రీ అందడం లేదు. సర్కారు స్కూళ్లు ఆగమైపోతున్నాయి. ఇవన్నీ చూసే వచ్చే ఎన్నికల్లో టీడీపీనే రప్పా.. రప్పా కోసేస్తానని సింబాలిక్ గా ఆ యువకుడు పోస్టర్ పట్టుకున్నాడని” జగన్ వ్యాఖ్యానించారు.



