ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలున్న మొదటి విడుత డీఏ బకాయిలను విడుదల చేసింది .
మిగిలిన డీఏ బకాయిలను త్వరలలోనే త్వరలోనేఅందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ. 40వేల నుంచి రూ.70వేల వరకు ఈ రోజు సోమవారం వారి అకౌంట్లకు జమచేసింది.
మిగిలిన వారికి ఆరు విడతల్లో అంటే ఒక్కో ఉద్యోగికి రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీఏ బకాయిల విడుదల పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోట్ల రాజేష్, నాపా ప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు.