pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • National »
  • Will Rahul Gandhi Became Pm Of India

ఇలా అయితే రాహుల్ పీఎం ఎలా..!

కాంగ్రెస్ తన ఉనికిని క్రమంగా కోల్పోతుందా.. మళ్లీ 2014 పీరియడ్​కు వెళ్తుందా..? కూటమి బలపడుతుంటే.. అందులోని కాంగ్రెస్​ మాత్రం వీక్ అవుతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఇలా అయితే రాహుల్ పీఎం ఎలా..!
  • Edited By: Pallavi,
  • Published on November 24, 2024 / 05:20 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

కాంగ్రెస్ తన ఉనికిని క్రమంగా కోల్పోతుందా.. మళ్లీ 2014 పీరియడ్​కు వెళ్తుందా..? కూటమి బలపడుతుంటే.. అందులోని కాంగ్రెస్​ మాత్రం వీక్ అవుతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నకల్లో అధికారం తమదేనని కాంగ్రెస్​ గట్టి నమ్మకంతో ఉండే. కానీ ప్రజలు మాత్రం రాహుల్​కు షాక్ ఇస్తూ మోడీకి హ్యాట్రిక్ గెలుపును అందించారు. అయితే 10 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్​కు 99 సీట్లు వచ్చాయి. ఇదొక్కటే ఆ పార్టికి ఊరటనిచ్చే అంశం. ఇంతవరకు బాగానే ఉన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ ప్రభావం తగ్గిపోతుంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములు.

ప్రస్తుత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు హర్యానా, కశ్మీర్ ఎన్నికలు జరిగాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విన్ సాధిస్తే.. కశ్మీర్​లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది. ​హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఆ అతివిశ్వాసంతో పాటు స్థానిక నాయకుల మధ్య సమన్వయలోపం వల్ల అక్కడ ఓటమి ఎదురైందనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆ పార్టీ పాఠాలు నేర్చుకుందా అంటే అదీ లేదు. దానికి మహా ఫలితాలే ఉదాహారణ. సేమ్ కర్నాటక, తెలంగాణలో ఇచ్చినట్లు గ్యారెంటీ హామీలను మహారాష్ట్రలోనూ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ప్రజలు మాత్రం నిర్మోహమాటంగా ఆ హామీలను తిరస్కరించారు. కాంగ్రెస్​కు ఘోరమైన ఫలితాలను అందించారు.

మహా ఫలితాలతో కాంగ్రెస్​కు మళ్లీ గడ్డుకాలం షురూ అయ్యింది. కాంగ్రెస్​ విపక్షాలను కలుపుకుని ఇండియా కూటమి పేరిట ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ కూటమి బలపడుతుంది కానీ కాంగ్రెస్​ మాత్రం వీక్ అవుతుందనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలో కూటమిలోని మిగితా పార్టీలకంటే అత్యధికంగా 101 స్థానాల్లో కాంగ్రెస్​ పోటీ చేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్​ సంఖ్య రావడం కూడా ఆ పార్టీకి కష్టంగా మారింది. 10 ఏళ్ల తర్వాత సెంచరీకి చేరువైన కాంగ్రెస్​..ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్తున్నట్లుగా కన్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎంత కష్టపడిన మోడీని అధిగమించి పార్టీకి ప్రజాదరణ సాధించలేకపోతున్నారనేది స్పష్టం.

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్​ హిమాచల్, కర్నాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలనే ఇస్తుంది కాంగ్రెస్. కర్నాటక, తెలంగాణ వరకు ఇవి వర్కౌట్​ అయ్యాయి కానీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఫలితాలొచ్చాయి. దీంతో కాంగ్రెస్ గ్యారెంటీలకు కాలం చెల్లందనే విమర్శలున్నాయి. పైగా రాష్ట్ర ఆర్థికస్థితిని పట్టించుకోకుండా ఈ గ్యారెంటీలుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్​ నేతలు తలలు పట్టుకుంటున్నారు. హిమాచల్​లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్‌ భవన్‌ను అటాచ్‌ చేస్తూ హిమాచల్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడం దివాళ తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెబుతోంది. ఇవన్నీ చూస్తున్నా కూడా కాంగ్రెస్​ అధిష్ఠానం మళ్లీ అవే వాగ్దానాలు ఇవ్వడం విడ్డూరం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దని పార్టీ నేతలకు చెప్పారు. అయినా పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం.

ఇక కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి బాగాలేదా అనే చర్చ కూడా నడుస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని నడపడం సీఎంలకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్​లో చిక్కుకోగా.. మిగితా రాష్ట్రాల్లో నిధులు లేక సీఎంలు తర్జనభర్జన పడుతున్నారు. మహా ఫలితాల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. కర్నాటక, తెలంగాణ సీఎంలను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీఎంలను మారిస్తే ఈ రాష్ట్రాల్లో పాలన గాడితప్పిందని కాంగ్రెస్​ హైకమాండ్​ ఒప్పుకున్నట్లే. ప్రస్తుతం తరుణంలో సీఎంలను మార్చకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఏదిఏమైన కాంగ్రెస్​ ముందు కాకుండా వెనక్కి వెళ్తుండడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • bjp
  • congress
  • latest telugu news
  • Maharashtra Elections
  • Modi

Related News

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

  • కేటీఆర్ కు పొంగులేటి సవాల్

  • వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?

  • కాంగ్రెస్ కు కవిత మద్ధతు

  • నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

  • కవితకు హరీశ్ కౌంటర్

Latest
  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy