అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. తర్వాత సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన శాంతి కుమారి , రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయనే సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అవసరమైన సూచనలు చేశారు.
Related News
-
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం..!
-
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
-
హెచ్సీయూ భూములపై మీనాక్షి రియాక్షన్
-
బంగాళాఖాతంలో వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
-
అధికారులు సెలవులు పెట్టొద్దు.. లీవ్ అప్లై చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
-
వర్షం బీభత్సం : కారులో కొట్టుకుపోయిన తండ్రికూతురు.. పోన్లు స్విచ్చాఫ్