నేను దానికి అడిక్ట్ అయ్యాను.. పాపం మా ఆయన
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం తర్వాత హనీమూన్ వెళ్తుందనుకుంటే ‘బేబీ జాన్’ మూవీ ప్రమోషన్స్లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచింది.
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం తర్వాత హనీమూన్ వెళ్తుందనుకుంటే ‘బేబీ జాన్’ మూవీ ప్రమోషన్స్లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల కీర్తి భర్తతో థాయ్ల్యాండ్కు వెళ్లి వచ్చింది. వర్క్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన వివాహ జీవితం ఎలా ఉందో వివరించింది. ‘‘పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే సంతోషంగా ఉన్నా. దానికి కారణం నేను ఆంటోని డేటింగ్లో ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. అందువల్ల నాకు పెద్దగా చేంజ్ అనిపించడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయా. అది ఆంటోనికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని కష్టంగా భావించడు. నన్ను అర్థం చేసుకొని చాలా విషయాల్లో సర్దుకుపోతారు. అందువల్ల జీవితం చాలా సంతోషంగా సాగుతుంది’’ అని చెప్పుకొచ్చింది.



